Friday, January 29, 2016

స్లీమన్ కథ-22: ట్రాయ్ నగలను భార్యకు అలంకరించాడు

పనివాళ్లు అందరూ వెళ్ళిపోయారు. సోఫియా తిరిగివచ్చింది. స్లీమన్ ఒక జేబుకత్తితో నిక్షేపాలను తవ్వి తీయడం  ప్రారంభించాడు. మట్టి, రాతిముక్కలు, పెద్ద పెద్ద రాళ్ళతో నిండిన రక్షణకుడ్యం కుప్పకూలేలా ఉంది. కానీ కళ్ళముందు కనిపిస్తున్న ఓ పెద్ద ఖజానా  అతని భయాలన్నింటినీ హరించేసింది. మళ్ళీ సోఫియావైపు తిరిగి, “త్వరగా వెళ్ళు, నీ పెద్ద శాలువ తీసుకురా” అన్నాడు.

Friday, January 22, 2016

స్లీమన్ కథ-21: ఆరు బుట్టల్లో, ఓ బస్తాలో బంగారం తరలించాడు

ఎట్టకేలకు నిక్షేపాలను కనిపెట్టాననుకున్నాడు. టర్కుల చూపు పడకుండా వాటిని రక్షించడ మెలా అన్నది తక్షణ సమస్య. పనివాళ్లలో ఎవరూ పసిగట్టలేదు. సోఫియా అతని పక్కనే ఉంది. ఆమెవైపు తిరిగి, “నువ్వు వెంటనే వెళ్ళి ‘పైడోస్’ అని కేకపెట్టు” అని చెప్పాడు. పైడోస్ అనే ఆ గ్రీకు మాటకు సెలవుదినం అని అర్థం.

Thursday, January 14, 2016

స్లీమన్ కథ-20: నిధులు దొరికాయి!

ఆగస్టు 4…అప్పటికే అతను జ్వరంతో బాధపడుతున్నాడు. ఇక ఆ వేసవిలో తవ్వకాలు ఆపేద్దామనుకుంటున్నాడు. అంతలో అతను ఎదురుచూస్తున్న నిధి మొదటసారి కంటబడింది. ఆనందపు అంబర మెక్కించేంత గొప్ప నిధిగా అతనికి తొలిచూపులో కనిపించలేదు. మూడు బంగారు చెవిపోగులు, ఒక బంగారు బొత్తం…! దగ్గరలోనే ఒక అస్థిపంజరం. అది ఒక యవతిదనీ; ఎముకల రంగును బట్టి, ట్రాయ్ తగలబడినప్పుడు మంటల్లో చిక్కుకుని మరణించి ఉంటుందనీ స్లీమన్ అంచనాకు వచ్చాడు.
(పూర్తి రచన 'నిధుల వేటలో...ఆశనిరాశాల ఊగిసలాటలో...' అనే శీర్షికతోhttp://magazine.saarangabooks.com/2016/01/13/%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2-%E0%B0%B5%E0%B1%87%E0%B0%9F%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%86%E0%B0%B6%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B6%E0%B0%B2-%E0%B0%8A%E0%B0%97%E0%B0%BF/ లో చదవండి)
bhaskar3
స్వస్తిక చిహ్నం కలిగిన ఒక దేవత

Saturday, January 9, 2016

వరదశోకగ్రస్త జనానికి జయలలిత అందించే జల్లికట్టు వినోదం!

తమిళనాడు ఎన్నికలు వస్తున్నాయి.
వరుణదేవుడికి సమయాసమయాలు తెలియవు. ఎన్నికలు వచ్చిపడుతున్న సమయంలో చెన్నైని కనీవినీ ఎరగని వర్షాల్లో ముంచెత్తి జయలలిత ప్రభుత్వం గుండెల్లో దడ పుట్టించాడు. ప్రభుత్వం వైఫల్యం జాతీయ స్థాయిలో సైతం మోతెక్కి పోయింది. అయినాసరే  చచ్చినాడికి వచ్చిందే కట్నం అన్నట్టుగా బాధితులకిచ్చే అన్నం పొట్లాల మీద అమ్మ సొంత బొమ్మ వేయించుకుని వరదకన్నీట తడిసిన జనం బతుకుల్ని పిండి వోట్ల చుక్కలు రాల్చుకోవాలని చూసింది.
ఇంకా వరద శోకం నుంచి రాష్ట్రం తేరుకొనే లేదు. ఒక పార్టీ, ఒక ప్రభుత్వం అనేముంది; ఎన్నికల వరదనుంచి గట్టెక్కడానికి ఏ గడ్డి అయినా కరవడానికి అన్ని పార్టీలు, ప్రభుత్వాలు సర్వదా సిద్ధమే. జయలలిత ప్రభుత్వం తాజాగా జనానికి జల్లికట్టు వినోదం అందించడం అనే ఓ కార్యక్రమాన్ని ఉద్యమస్థాయిలో చేపట్టి కేంద్రాన్ని ఒప్పించింది. ఎన్నికల ఏరు దాటడానికి  జయలలిత చేయి అందిస్తుందని కాబోలు మోడీ ప్రభుత్వం జల్లికట్టు వినోదానికి అడ్డుకట్ట తొలగించి ఎడ్లతోనూ, దున్నపోతులతోనూ ఇంచక్కా ఆడుకుని వినోదిస్తూ వరద దుఃఖం మరచిపొండని తమిళ జనానికి సందేశించింది.
ఈ పార్టీలకు, ప్రభుత్వాలకు సిగ్గు లేదు. జనానికి దిక్కు లేదు!!!

Thursday, January 7, 2016

ట్రాయ్ తవ్వకాలలో 'శివలింగా'లు, యోని చిహ్నాలు

పదడుగుల లోతున, చిన్నపాటి బొంగరం ఆకారంలో ఉన్న మృణ్మయమూర్తులు కనిపించడం, వాటిలో కొన్నింటికి రెండు రంధ్రాలు ఉండడం చూసి స్లీమన్ మరింత విస్తుపోయాడు. భారతదేశంలోని దేవాలయాలలో తను చూసిన నల్లరాతి భారీ శివలింగాలు అతనికి చటుక్కున గుర్తొచ్చాయి. ఈ తవ్వకాలలో కూడా పెద్ద సంఖ్యలో కనిపించిన లింగాకృతులు పురుషసూత్రానికి చెందినవైతే; రంధ్రాలు చేసిన బొంగరం ఆకృతులు స్త్రీసూత్రానికి చెంది ఉంటాయనుకున్నాడు. ఇంతకీ ప్రియామ్ ప్రాసాదంలో ఇలాంటివి ఎందుకున్నాయో అతనికి అర్థం కాలేదు.